telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2020 : బెంగుళూరు పై ఢిల్లీ ఘనవిజయం..

ఐపీఎల్ 2020 లో ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య అబుదాబి వేదికగా మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకోవడంతో ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ దేవదత్ పాడికల్ (50), డివిలియర్స్ (35) రాణించడంతో బెంగళూరు నిర్ణిత 20 ఓవర్లలో 7 కోల్పోయి152 పరుగులు చేసింది. ఇక 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి వచ్చిన ఢిల్లీకి రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ పృథ్వీ షా(9) కే వెనుదిరిగాడు. కానీ ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన రహానే తో కలిసి ధావన్ రెచ్చిపోయాడు. ఈ క్రమంలోనే రహానే (60), ధావన్ (54) అర్ధ శతకాలు సాధించడంతో ఢిల్లీ మరో ఓవర్ మిగిలి ఉండగానే 4 వికీలో కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. అయితే ఈ విజయం తో ఢిల్లీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి వెళ్ళింది. అలాగే వరుసగా నాలుగో మ్యాచ్ ఓడిపోయిన బెంగళూరు మూడో స్థంలో ఉంది. ఇక రేపు మ్యాచ్ లో హైదరాబాద్ విజయం సాధిస్తే… ఆ జట్టు మూడో స్థానానికి, బెంగళూరు నాలుగో స్థానికి అలాగే ఇప్పుడు నాలుగో స్థానంలో ఉన్న కోల్ కతా 5వ స్థానానికి వెళ్తాయి. చూడాలి మరి రేపు ఏం జరుగుతుంది అనేది.

Related posts