telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు దుర్మరణం

Accident

గుంటూరు జిల్లా చింతపల్లి సమీపంలో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. బంధువుల పెళ్లికి వెళ్ళి తిరుగు ప్రయాణంలో ట్రాక్టర్ బోల్తా పడటంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.

గుంటూరు జిల్లా చుండూరు మండలం మాలపల్లి నుంచి 50 మంది కలిసి ట్రాక్టర్ లో తెనాలిలో జరిగిన పెళ్లికి వెళ్లారు. పెళ్లి అయిపోయాక తిరుగు ప్రయాణమయ్యారు. మార్గంలోని చింతపల్లి గ్రామ సమీపంలోని అంబేద్కర్ నగర్ వద్ద మలుపు తిరుగుతుండగా ట్రాక్టర్ అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. క్షతగాత్రుల్లో చాలా మంది మహిళలు, పిల్లలేనని అధికారులు తెలిపారు. గాయపడ్డ వారిని ఆసుపత్రులకు తరలించారు.

Related posts