telugu navyamedia
రాజకీయ వార్తలు

కరోనా వైరస్ ఎఫెక్ట్ .. చైనాకు విమాన సర్వీసులు రద్దు!

modi govt decided air india to private

కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ దేశాలు చైనాతో సంబంధాలను పరిమితం చేసుకున్నాయి. అనేక విమానయాన సంస్థలు చైనాకు తమ సర్వీసులు నిలిపివేశాయి. భారత ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా కూడా చైనాకు అన్ని రకాల సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయించింది. జూన్ 20 వరకు చైనాకు విమానాలు నడపరాదని భావిస్తోంది.

కరోనా వైరస్ కారణంగా చైనాలో ఇప్పటివరకు 2 వేలకు పైగా మరణాలు సంభవించాయి. ఈ ప్రమాదకర వైరస్ బారినపడిన వారి సంఖ్య వేలల్లో ఉంది. ఈ నేపథ్యంలో చైనాలో పరిస్థితులపై సమీక్షించేందుకు ఎయిరిండియా అత్యున్నత నిర్ణాయక కమిటీ బుధవారం సాయంత్రం సమావేశమైంది. ఇలాంటి పరిస్థితుల్లో చైనాకు విమానాలు నడపకపోవడమే మంచిదని ఓ నిర్ణయానికి వచ్చారు. దీనిపై ఎయిరిండియా సీఎండీ ఓ ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

Related posts