చంద్రబాబు హయాంలో కట్టిన పంచాయతీ భవనాలకు వైసీపీ రంగులు వేసుకుంటోదని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. శ్మశానాలకు, ఆఖరికి మరుగుదొడ్లకు రంగులు వేసుకొని బులుగు బ్యాచ్ తో చిటికెలు వేయించుకునే దుస్థితి జగన్ రెడ్డి గారికి 48 ఏళ్లకే వచ్చింది అనే విషయం గమనించండి విజయసాయిరెడ్డి గారు’ అని విమర్శించారు.
టీడీపీ హయాంలో కట్టిన పోలీస్ స్టేషన్ కి కొత్త పేరు పెట్టి ఎవరూ కొట్టకపోయినా ఆయనే డప్పు కొట్టుకోవడం చూస్తే పాపం అనిపిస్తుంది. ఇచ్చిన ఒక్క ఛాన్స్ ఇప్పటికే ఆఖరి ఛాన్స్ అయ్యింది. అన్ని తెలిసి కూడా 30 సంవత్సరాలు మీరే సారు అంటూ మీ లాంటి వారు కల్పించే భ్రమలో బ్రతికేస్తున్నారు’ అని చురకలంటించారు. ‘ఇప్పటికే తుగ్లక్ చరిత్ర గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటున్నారు అని గ్రహించండి విజయసాయిరెడ్డి గారు’ అని విమర్శించారు.