telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

ఎమ్మెల్యే విడదల రజనీ మరిది కారుపై రాళ్లదాడి

vidadadla Rajini ycp

గుంటూర్ జిల్లాలోని చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ మరిది గోపినాథ్‌పై నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడికి పాల్పడ్డారు. విడదల వారి ప్రభను కోటప్పకొండలో వదిలి కారులో ఇంటికి వస్తున్న సమయంలో దుండగులు ఆయన కారుపై రాళ్లతో దాడిచేశారు. ఈ ఘటనలో ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.

ఇటీవల ఓ కార్యక్రమానికి వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు రాగా.. స్థానిక ఎమ్మెల్యే రజనీకి సమాచారం ఇవ్వకుండా ఎలా వస్తారని గోపినాధ్ అడ్డుకున్నారు. అయితే ఆ మరుసటి రోజే రజనీ మరిదిపై దాడి జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎంపీ వర్గమే ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. దాడి ఘటనపై గోపినాథ్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Related posts