ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య సంబంధాల పై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు. శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ రెండు రాష్ట్రాల సంబంధాలు మంచిగానే ఉంటే పోతిరెడ్డిపాడుకు నీటి విడుదలపై కృష్ణా వాటర్ బోర్డుకు తెలంగాణ ఎందుకు ఫిర్యాదు చేసిందని ప్రశ్నించారు.
ఏపీ, తెలంగాణ సంబంధాలపై రాష్ట్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. పోతిరెడ్డిపాడుకు నీళ్లు మళ్లిస్తేఓర్వలేని పరిస్థితిలో తెలంగాణ ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. కృష్ణా నది వరదలపై చంద్రబాబు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.తెలంగాణతో సంబంధాలు బాగున్నాయని వైసీపీ ప్రభుత్వం చెబుతుండటాన్ని ఆయన తప్పుపట్టారు. తెలంగాణ ఫిర్యాదుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని బాబు డిమాండ్ చేశారు.