telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

పెరుగుతున్న కరోనా కేసులు..మీడియా సమావేశాలు నిలిపివేత!

Corona

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మీడియా సమావేశాలను కేంద్రం నిలిపివేసింది. కరోనాపై సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాలన్నా, కేవలం సంబంధిత ప్రభుత్వ అధికారి నుంచి వచ్చిన సమాచారాన్ని మాత్రమే తెలియజేయాలని మార్చి చివరి వారంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అప్పటి నుంచి ప్రతి నిత్యమూ పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యను మీడియాకు తెలిపేందుకు సమావేశాలను ఏర్పాటు చేస్తూ వచ్చిన కేంద్రం, కేసుల సంఖ్య భారీగా పెరిగిన సమయానికి మీడియా సమావేశాలను నిలిపివేసింది.

మే 11న కేసులు 67,152కు చేరిన తరువాత మీడియా సమావేశాలు నిలిపివేసి, కేవలం పత్రికా ప్రకటనను విడుదల చేస్తూ వచ్చిన కేంద్రం, కేసుల సంఖ్య లక్షను అధిగమించిన వేళ, ఆ మాత్రం సమాచారాన్ని కూడా అందించలేదు. కేసుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఆరోగ్య శాఖ అధికారులు మీడియాకు దూరమయ్యారు.

సుప్రీంకోర్టు సైతం కరోనాపై తన ఆదేశాల్లో మహమ్మారిపై స్వేచ్ఛగా చర్చలు జరిపి సమాచారాన్ని ప్రజలకు అందించవచ్చని, ఈ విషయంలో తాము కల్పించుకోలేమని స్పష్టం చేస్తూ, కేసుల విషయంలో మాత్రం అధికారిక సమాచారాన్నే తెలియజేయాలని ఆదేశించింది. ఏప్రిల్ 25కు ముందు వరకూ ల్యాబ్ ల నుంచి కలెక్ట్ చేసిన కరోనా పరీక్షల గణాంకాలను విడుదల చేస్తూ వచ్చిన ఐసీఎంఆర్, ఆపై వివరాలను మీడియాకు అందించడాన్ని నిలిపివేసింది.

Related posts