telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు.. సమన్లు జారీ చేసిన సీబీఐ కోర్టు

ఏపీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు హైద్రాబాద్ సీబీఐ కోర్టు సీబీఐ సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 12న విచారణకు హాజరు కావాలని బొత్సను కోర్టు ఆదేశించింది. ఫోక్స్ వ్యాగన్ కేసులో ఆయన సాక్షిగా ఉన్నారు. 2005లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వోక్స్ వ్యాగన్ కేసు నమోదైంది. వోక్స్ వ్యాగన్ కేసులో అవినీతి చోటు చేసుకొందని ఆనాడు ఆరోపణలు రావడంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకు అప్పగించింది.ఆ సమయంలో బొత్స సత్యనారాయణ ఏపీ రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు.

వోక్స్ వ్యాగన్ కేసులో సుమారు రూ. 12 కోట్ల రూపాయాల అవినీతి చోటు చేసుకొందని సీబీఐ గుర్తించింది. ఈ కేసులో ఇప్పటికే సుమారు రూ. 7 కోట్లను రికవరీ చేశారు. మరో రూ. ఐదు కోట్లను రికవరీ చేయాల్సి ఉంది.ఈ కేసులో ఇప్పటికే మూడువేల పేజీల చార్జీషీటును సీబీఐ దాఖలు చేసింది. 59 సాక్షులను విచారించింది. ఓ కంపెనీ డైరెక్టర్ గా ఉన్న జైన్ అక్రమాలకు పాల్పడినట్టుగా సీబీఐ అనుమానిస్తోంది.
ఈ కేసులో ఆనాడు మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ సాక్షిగా ఉన్నందున ఈ కేసు విషయమై హాజరుకావాలని సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసినట్టు తెలుస్తోంది.

Related posts