telugu navyamedia
క్రీడలు వార్తలు

వన్డే సిరీస్ లో వారే ఓపెనింగ్ చేస్తారు : కోహ్లీ

భారత్-ఇంగ్లండ్‌ మధ్య తొలి వన్డే నేడు జరుగుతుంది. టెస్టు, టీ20 సిరీసుల్ని కోల్పోయిన ఇంగ్లండ్ జట్టు ఇందులోనైనా గెలవాలని పట్టుదలతో ఉంది. ఇక మ్యాచ్‌కు ముందు రోజు జ‌రిగే వ‌ర్చువ‌ల్ ప్రెస్ మీట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పాల్గొన్నాడు. అందులో కోహ్లీ మాట్లాడుతూ… ఈ సిరీస్ లో శిఖర్ ధావ‌న్‌, రోహిత్ శర్మలే ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తారు. వ‌న్డేల విష‌యంలో ఇందులో ఎలాంటి సందేహాలు అవ‌స‌రం లేదు. రోహిత్-ధావన్ కొన్నేళ్లుగా అద్భుతంగా ఆడుతున్నారు. మా మొదటి ప్రాధాన్యత వారికే’ అని కోహ్లీ తెలిపాడు. ఇక టీ20ల్లో విఫలమయిన కేఎల్ రాహుల్ రిజర్వ్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. ఇక టాప్ ఆర్డర్‌లో చోటు కల్పించే విధంగా సూర్యకుమార్ యాదవ్ ఆడితే.. అతడి కోసం ఏదైనా చేయాలని కోహ్లీ పేర్కొన్నాడు. ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ అదరగొట్టిన విషయం తెలిసిందే. ఒకవేళ సూర్య వన్డేల్లో ఆడాలంటే కచ్చితంగా శ్రేయాస్ అయ్యర్‌ను పక్కనపెట్టాల్సిందే. చూడాలి మరి ఈరోజు జరగనున్న మొదటి మ్యాచ్ లో ఎవరు తుది జట్టులో ఉంటారు అనేది.

Related posts