భారత యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనత సాధించాడు. రాయల్ లండన్ కప్-2021 కోసం ఇంగ్లీష్ కౌంటీ జట్టు లంకషైర్ క్రికెట్ క్లబ్.. అయ్యర్తో ఒప్పందం చేసుకుంది. అయితే ఈ ఘనత సాధించిన ఆరో భారత ఆటగాడిగా అయ్యర్ రికార్డులకు ఎక్కాడు. అయితే ఈ విషయాన్ని లంకషైర్ క్రికెట్ క్లబ్ ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ… ‘భారత అంతర్జాతీయ బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్తో ఒప్పందం చేసుకున్నందుకు సంతోషిస్తున్నాం. అతడి రాక కోసం వేచిచూస్తున్నాం’ అని తెలిపింది. ‘ఫరూక్ ఇంజినీర్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ లాంటి గొప్ప ఆటగాళ్లు ఆడిన లంకషైర్ జట్టుకు నేను ప్రాతినిథ్యం వహిస్తుండడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. చాలా సంతోషంగా ఉంది’ అని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్ వేదికగా రాయల్ లండన్ టోర్నీ జరుగుతుంది. జూలై 22 నుంచి ఆగస్టు 19 వరకు 18 జట్ల మధ్య ఈ టోర్నీ జరగనుంది. అయితే జూలై 15న లండన్లో అడుగుపెట్టనున్న అయ్యర్.. నెల రోజుల పాటు జరిగే లండన్ కప్-2021 లీగ్ దశ మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడు. ఇక భారత్ తరఫున 21 వన్డేలు, 29 టీ20లు ఆడాడుశ్రేయస్ అయ్యర్.
previous post
అమరావతి రాజధానిని జగన్ అప్పట్లో ఆమోదించారు: సీపీఐ నారాయణ