telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఇంటర్ బోర్డు వివాదంపై కేసీఆర్ సమీక్ష

Woman candidates kcr cabinet Telangana

తెలంగాణ ఇంటర్ బోర్డు వివాదంపై సీఎం కేసీఆర్ ఎట్టకేలకు స్పందించారు. బుధవారం నాడు కార్యాలయంలో సంబధిత ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, ఇంటర్ బోర్డు సెక్రటరీ ఆశోక్ పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇంటర్ ఫలితాలపై నెలకొన్న వివాదాలపై ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదికను రెండు రోజుల్లో ఇచ్చే అవకాశం ఉంది.

ఈ నెల 18న విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాల అవకతవకలతో ఇప్పటికే 20కు పైగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాలు హైద్రాబాద్ ఇంటర్ బోర్డు వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఈ తరుణంలో సీఎం సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకొంది. ఈ సమావేశంలో ఈ వివాదంపై కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.

Related posts