అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానిని జగన్ అప్పట్లో ఆమోదించారని సీపీఐ నేత నారాయణ అన్నారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… అధికారంలోకి వచ్చాక మాత్రం మూడు రాజధానులు అంటున్నారని సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. రాజధానిని అమరావతి నుంచి మార్చాలనుకుంటే రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని ఆయన ఏపీ సీఎం జగన్ కు సూచించారు.
రాజధాని అమరావతిలోనే కొనసాగేలా తాము ప్రత్యక్ష పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.కులాలు, మతాల వారీగా జగన్ ఏపీలో ఉప ముఖ్యమంత్రులను నియమించారని నారాయణ విమర్శించారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసిన వైసీపీ నేతలు ఇక్కడ మాత్రం సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకమని అంటున్నారని ఆయన దుయ్యబట్టారు.
రాజకీయాలు కావాలంటే స్పీకర్ పదవికి రాజీనామా చేయాలి: జవహర్