telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కూటమి భయంతోనే కుట్రలు: చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి కేంద్రం పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కూటమితో బీజేపీ నేతలకు భయం పట్టుకుందని, అందుకే కుట్రలు, కుతంత్రాలు పెంచారని విమర్శించారు. ఎన్నికల ముందు కూటమి అసాధ్యం అన్నప్పటికీ తాము ముందస్తుగా కూటమి ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వదని.. ఇతరులను సాయం చేయనివ్వదని చంద్రబాబు మండిపడ్డారు.

ఈరోజు టీడీపీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ ఏపీకి అన్యాయం జరిగిన విషయాని అన్ని కమిటీలు చెప్పాయని ఆయన వివరించారు. అరకొర విపత్తు సాయాన్ని మొయిలీ కమిటీ నిలదీసిందని అన్నారు. తితలీ తుఫాను పరిహారం సగానికి తగ్గించడాన్ని ప్రశ్నించిందని చెప్పారు. విపత్తు సాయం ఏటా 15శాతం పెంచాలని మొయిలీ కమిటి చెప్పిందని పేర్కొన్నారు.

Related posts