రాయలసీమ డిక్లరేషన్ అమలయ్యే వరకు తమ పోరాటం ఆగదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హైకోర్టుతోపాటు రాష్ట్ర రాజధానిని కూడా రాయల సీమలో ఏర్పాటు చేయడం మంచిదని డిమాండ్ చేశారు.
రాజధాని కోసం అధ్యయనం పేరుతో కాలయాపన చేయడం కంటే మూడు ప్రాంతాలకు మూడు రాజధానులు ఇస్తే సరిపోతుందని ఆయన అన్నారు.ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించి ప్రత్యేక రాయలసీమ డిమాండ్ చేసే పరిస్థితులు తేవొద్దని హితవు పలికారు. రాయల సీమపై అభిమానం ఉంటే రాంగోపాలవర్మ మంచి సినిమాలు తీస్తే బాగుంటుందని వెంకటేశ్ అన్నారు.
సంజయ్ మంజ్రేకర్ కు బీసీసీఐ షాక్.. కామెంటరీ ప్యానల్ లో దక్కని స్థానం!