విజయశాంతి.. పార్టీ మార్పుపై గత కొంతకాలంగా చర్చ హాట్హాట్గా సాగుతోంది… పార్లమెంట్ ఎన్నికల తర్వాత సైలెంట్ అయిన రాములమ్మ… ఆ తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ సినిమాలో నటించారు.. ఇక, వరుస సినిమాలు చేస్తారనే చర్చ సాగినా.. ఆమె మాత్రం అంగీకరించలేదు. అయితే, గత కొంతకాలంగా వరుసగా ఆమెను బీజేపీ నేతలు కలవడం.. పార్టీలోకి ఆహ్వానించారనే టాక్ వినిపించింది.. ఇది సాధారణ భేటీగానే కొందరు వ్యాఖ్యానించగా… కాంగ్రెస్ నేతలు మాత్రం ఆమె పార్టీలోనే కొనసాగుతారని చెబుతూ వస్తున్నారు. ఆమె ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకుంటారని టాక్ నడిచింది.. ఆ తర్వాత గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన నడ్డాను ఆమె కలిశారని.. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని గుసగుసలు వినిపించాయి.. ఇవేవీ జగలేదు.. కానీ, బీజేపీ నేతలపై వస్తున్న విమర్శలపై మాత్రం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వస్తున్నారు రాములమ్మ.. ఇక, ఇవాళ గ్రేటర్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన ఆమె.. కాషాయం కలర్లో ఉన్న మాస్క్తో దర్శనమిచ్చారు. దీంతో.. రాములమ్మ చెప్పకే.. ఇలా.. తాను బీజేపీలో చేరడం ఖాయం అని సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది.
previous post
next post