దేశంలో ఎన్ని చట్టాలు తెచ్చినా…ఎన్కౌంటర్లు, ఉరిశిక్షలు అంటూ ఎన్ని చేసినా… మహిళలపై అఘాయిత్యాలకు బ్రేక్ పడటం లేదు. మహిళలు కనిపించగానే.. రేప్లు చేస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు కొందరు దుర్మార్గులు. ఇలాంటి రాక్షసుల వల్ల మహిళలు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా త్రిపురలో మరో దారుణం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని ఖౌవాయి జిల్లాలో ఇద్దరు బాలికలపై ఎనిమిది మంది యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒక బాలిక పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. ఖటియాబరి ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలికలు.. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి సోమవారం టూ వీలర్పై బయటకు వెళ్లారు. కొంత దూరం వెళ్లాక.. మరో ఆరుగురు.. వేరే వాహనాలపై వచ్చి వారితో కలిశారు. అంతా కలిసి రాత్రి ఏడున్నర గంటల సమయంలో బాలికలను దట్టమైన అడవిలోకి తీసుకెళ్లారు. అక్కడ సామూహికంగా రేప్ చేశారు. బాధితులు అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. భయపడిన నిందితులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. పోలీసులతో కలిసి ఘటనా స్థలానికి వెళ్లిన తల్లిదండ్రులు.. దారుణమైన స్థితిలో ఉన్న బాలికలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం నిందితులపై పోక్సో చట్టం కింద కేసు బుక్ చేసి.. పోలీసులు అరెస్ట్ చేశారు.
previous post
అప్పలనాయుడిని చూస్తుంటే అలా అనిపించడం లేదు: రోజా