పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో దివంగత నటుడు ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిది అడుగులా 3 అంగుళాల ఎత్తున్న ఈ విగ్రహాన్ని చూస్తుంటే తన మనసు ఉప్పొంగుతోందని చెప్పారు. తాను తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చే సమయానికే ఎస్వీ రంగారావు దూరమయ్యారని తెలిపారు. ఇప్పుడు ఆయనే బతికి ఉండివుంటే, ‘సైరా’ చిత్రాన్ని చూసి ‘శభాష్ రా చిరంజీవి’ అని అనుండేవారని చిరంజీవి వ్యాఖ్యానించారు.
పైన ఎక్కడున్నా ఆ మహానటుడు తమ ప్రయత్నాన్ని దీవిస్తారనే నమ్ముతున్నానని అన్నారు. తాడేపల్లి గూడెంలోని ఎస్వీఆర్ సర్కిల్, కె.యన్.రోడ్లో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని గతంలోనే విగ్రహాన్ని ఆవిష్కరించాలని తొలుత భావించారు. కానీ, కొన్ని అనివార్య కారణాలవల్ల దీనిని వాయిదా వేశారు. అన్ని అనుమతులూ వచ్చేసరికి ఇంత సమయం పట్టిందని అన్నారు. తన ఫ్యాన్స్ చూపే అభిమానమే తనను ఇంతవాడిని చేసిందని వ్యాఖ్యానించిన చిరంజీవి, భవిష్యత్తులో అభిమానులు మెచ్చే మరిన్ని చిత్రాలను చేయడమే లక్ష్యమన్నారు.
పారదర్శక పాలన అందించేందుకు జగన్ కృషి