telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలుగుదేశం పార్టీకి కొత్త బాస్ లు..

TDP-flag

2019 ఎలక్షన్స్ నుంచి తెలుగుదేశం పార్టీ తీవ్రంగా నష్టపోతూ వస్తోంది. అధికారం కోల్పోవడమే కాకుండా సీనియర్ నాయకులూ తెలుగుదేశం పార్టీని వీడారు. వరుస ఎదురుదెబ్బలు తగులుతోన్న సమయంలో తెలుగుదేశం పార్టీ నిర్మాణంపై ఫోకస్‌ పెట్టారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇందులో భాగంగా రెండు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను ప్రకటించారు.. టీడీపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు పేరు, టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఎల్ రమణను ప్రకటించారు.. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.. ఇక, 24 మంది సభ్యులతో కొత్త పొలిట్ బ్యూరోను ఏర్పాటు చేశారు.. 27 మంది సభ్యులతో సెంట్రల్ కమిటీని ప్రకటించారు.. కొత్తగా ప్రకటించిన కమిటీల్లో ఆరుగురిని వైస్‌ ప్రెసిడెంట్లుగా నియమించిన చంద్రబాబు.. సెంట్రల్‌ జనరల్ కమిటీ సభ్యులుగా మరో 8మందిని ప్రకటించారు. అయితే, ఎల్‌. రమణను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలంటూ తెలంగాణ ప్రాంతానికి చెందిన కొంతమంది నేతలు.. చంద్రబాబుకు విజ్ఞప్తి చేసినా.. మళ్లీ ఆయనకే అవకాశం కల్పించారు. అలాగే 25 మందితో పార్టీ పొలిట్ బ్యూరో ఏర్పాటు చేశారు.

పొలిట్ బ్యూరో సభ్యుల లిస్ట్ ఇదే..
అచ్చన్ననాయుడు, రమణ, నక్కా ఆనంద్ బాబు, వార్ల రామయ్య, కళా వెంకట్రావు, బోండా ఉమా, బుచ్చయ్య చౌదరి, పితాని, కోళ్లు రవీంద్ర, గుమ్మడి సంధ్యారాణి, బాలకృష్ణ, గల్లా జయదేవ్, సోమిరెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్, లోకేష్, అశోక్ గజపతి రాజు, యనమల, అయ్యన్న, రావుల, అనిత, కాలువ శ్రీనివాసులు, చైనా రాజప్ప, కెఈ కృష్ణ మూర్తి, ఫారూఖ్, శ్రీనివాసరెడ్డి.

Related posts