సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంత్రి పదవుల పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరు మంత్రులుగా ఉన్నా జనాలకు ఒరిగేది ఏమీ లేదని అన్నారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు తాను ఏం చేశానో జనాలకు తెలుసని చెప్పారు. ప్రగతి భవన్ లో కుక్క చనిపోతే డాక్టర్ పై కేసు పెట్టారని, జ్వరాలతో వందలాది మంది చనిపోతుంటే కేసులు ఎవరిపై పెట్టాలని ప్రశ్నించారు. ఈ మరణాలకు బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఓ వైపు అంటువ్యాధులు ప్రబలుతుంటే బ్లీచింగ్ పౌడర్ వేయడానికి కూడా డబ్బులు లేవా? అని ప్రశ్నించారు. మంత్రి ఈటల రాజేందర్ ముమ్మాటికీ టీఆర్ఎస్ కు యజమానే అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ కోసం డబ్బులు కూడా బాగా ఖర్చు చేశారని చెప్పారు. బతుకుదెరువు కోసమే గతంలో తాను టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లానని చెప్పుకొచ్చారు.