telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కేసులపేరుతో రైతులను వేధించడం దారుణం: లోకేష్‌

Nara Lokesh

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేష్‌ మరోసారి విమర్శలు గుప్పించారు. రైతులపై కేసులు పెట్టడం సీఎం జగన్‌రెడ్డి దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. కడుపు మండి రోడ్డెక్కిన రైతులని కేసుల పేరుతో వేధించడం దారుణమని అన్నారు.

రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం చేతులెత్తేయడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. దీంతో నెల్లూరు జిల్లాలో రైతుల్ని దళారులు దోచుకుంటున్నారని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా సంగంలోని ధర్నా చేసిన 15 మంది రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని లోకేష్‌ డిమాండ్ చేశారు.

Related posts