telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాష్ట్రంలో నియంతృత్వ పాలన.. ఎస్ఈసీపై ఎందుకింత కక్ష: కన్నా

Kanna laxminarayana

రాష్ట్రంలో నియంతృత్వ పాలన నడుస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు. ఒక బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపారని మండలినే రద్దు చేశారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకువచ్చి ఎస్ఈసీపై కక్ష సాధించారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో జరిగిన అనేక దౌర్జన్యాలకు, అక్రమాలకు ఎన్నికల కమిషన్ స్పందించలేదని అన్నారు. అన్యాయంగా ఏకగ్రీవాలైన సందర్భంలోనూ నోరు మెదపలేదని, మరి ఇన్ని దుర్మార్గాలకు సహకరించిన ఎన్నికల కమిషనర్ పై ఇంతలా ఎందుకు కక్షకట్టరో అర్థం కావడంలేదని అన్నారు.

ఒకరకంగా ఎన్నికల సంఘం ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేసింది. వైసీపీ అభ్యర్థుల దుర్మార్గాలపై ఎన్నో ఫిర్యాదులు చేసినా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు. వైసీపీ నేతలు, పోలీసుల కుమ్మక్కయ్యారంటూ మొత్తుకున్నా ఫలితం లేకపోయింది. అలాంటి ఎన్నికల కమిషనర్ పై ఇలాంటి చర్య ఉంటుందని ఊహించ లేకపోయామని అన్నారు.ఇది సీఎం అహంకారానికి నిదర్శనమని, రాష్ట్ర విభజన తర్వాత ఇంతటి దుర్గతి ఎప్పుడూ పట్టలేదని కన్నా వ్యాఖ్యానించారు.

Related posts