telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మేడిగడ్డకు బయలుదేరిన కేసీఆర్..గోదావరి నీటి పై ఏరియల్ సర్వే!

KCR cm telangana

తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో మేడిగడ్డకు బయలుదేరారు. మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద ఈ వర్షాకాలంలో గోదావరి నదిలోకి చేరిన నీటిని కేసీఆర్ స్వయంగా పరిశీలించనున్నారు. గొదావరిలో పెరిగిన నీటిమట్టం పై ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చేయనున్నారు. సుమారు 150 కిలోమీటర్లకు పైగా నదిలో నీటిని కేసీఆర్ పరిశీలించనున్నారు.

అనంతరం ఆయన కాళేశ్వరం ప్రాజెక్టును కూడా సందర్శించనున్నారు. ఈ వర్షాకాల సీజన్ లో సంతృప్తికరంగా వర్షాలు కురవగా గోదావరి నదికి భారీ వరద వస్తున్నదన్న సంగతి తెలిసిందే. ఈ వరదలో ఎక్కువభాగం సముద్రంలోనే కలుస్తోంది. ప్రస్తుతం ధవళేశ్వరం నుంచి సుమారు 15 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతూ, సముద్రంలో కలిసిపోతోంది.

Related posts