telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కన్నెపల్లి పంప్‌హౌస్ పనులను పరిశీలించిన కేసీఆర్

kcr second day supervising kaleswaram

కాళేశ్వరం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కన్నెపల్లి పంప్‌హౌస్ పనులను పరిశీలించారు. క్క‌డి నుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా మేడిగడ్డకు చేరుకుని అక్కడ పూర్తి కావచ్చిన బ్యారేజ్ పనులను పరిశీలించారు.పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన పనులను కూడా వేగంగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజీని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు.

పనుల పురోగతిపై అధికారులను సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. పని త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన వెల్డ‌ర్స్‌, ఫిట్ట‌ర్స్ తదితర సిబ్బందిని దేశంలో ఎక్కడినుంచైనా తక్షణమే తెప్పించి పనులను వేగవంతం చేసేందుకు సహకరించాలని మెగా కృష్ణా రెడ్డిని సీఎం కోరారు. గేటు గేటుకూ సరిప‌డా సిబ్బందిని నియ‌మించుకొని మూడు షిప్టుల్లో పనిచేయించాలన్నారు.

Related posts