నాడు-నేడు కార్యక్రమంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏపీ సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పాఠశాలలపై ప్రకటన చేశారు. సెప్టెంబర్ 5న స్కూళ్లను ప్రారంభించాలని జగన్ తెలిపారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ సెప్టెంబర్ 5న పాఠశాలలను ప్రారంభించాలని ఆదేశించారు. ఆ సమయానికి నాడు-నేడు కార్యక్రమం కింద చేపట్టిన అన్ని పనులు పూర్తి కావాలని జగన్ చెప్పారు. ప్రతి స్కూల్లో వాల్ పెయింటింగ్స్, బొమ్మలు వేయాలని ఆదేశించారు. విద్యార్థులను ఆకట్టుకునేలా పాఠశాలలు ఉండాలని చెప్పారు. మంత్రి సురేశ్ మాట్లాడుతూ, పాఠశాలల పునఃప్రారంభానికి అన్ని సిద్ధం చేస్తున్నామని తెలిపారు. నాడు-నేడు కార్యక్రమం మొదటి దశ పనులు దాదాపు పూర్తయ్యాయని చెప్పారు.