telugu navyamedia
వార్తలు సామాజిక

ఎయిరిండియా ఉద్యోగులకు సెలవుల నజరానా!

modi govt decided air india to private

చైనాలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ ను చూసి ప్రపంచ దేశాలు జంకుతున్నాయి. కరోనా వైరస్ బారిన పడి డ్రాగన్ విలవిల్లాడుతోంది. అటువంటి సమయంలో ఎవరైనా అక్కడికి వెళ్లారంటే అది సాహసమే కదా. అంతటి సాహసం చేసినందుకే ఎయిరిండియా తమ సంస్థ ఉద్యోగులకు వారం రోజులు సెలవుల నజరానా ప్రకటించింది.

వివరాల్లోకి వెళితే…కరోనా భయంతో అల్లాడిపోతున్న చైనాలో భారతీయ విద్యార్థులు, సందర్శకులు, వ్యాపార పనిమీద వెళ్లిన వారు పెద్ద ఎత్తున చిక్కుకున్నారు. అక్కడి వూహాన్ నగరంలో కరోనా మరణాల సంఖ్య తీవ్రంగా ఉండడంతో వీరంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అక్కడ చిక్కుకున్న తమ వారి గురించి వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.

ప్రభుత్వమే ఏదో ఒకటి చేయాలని వేడుకున్నారు. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఎయిరిండియా ప్రత్యేక విమానంలో రెండు విడుతలుగా దాదాపు 650 మం దిని అక్కడి నుంచి తీసుకువచ్చింది. చైనా వెళ్లడానికి అంతటి సాహసం చేశారు కావునే వారికీ నజరానా అంటూ సంస్థ ప్రకటించింది. విమానయానంలో సేవలందించిన 30 మంది కేబిన్ క్రూ, ఎనిమిది మంది పైలట్లు, పది మంది కమర్షియల్ ఉద్యోగులతో కలిపి మొత్తం 64 మందికి ఈ సెలవులు మం జూరు చేసింది.

Related posts