telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

బ్రేకింగ్ : రాజకీయాల నుంచి తప్పుకునే యోచనలో వంశీ

Vamsi

రాజకీయాలపై గన్నవరం ఎమ్మెల్యే వంశీ నిర్వేదానికి గురయ్యారు. వైకాపా లో అందరిని కలుపుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నా, దుట్టా, యార్లగడ్డ రెచ్చగొట్టేలా వ్యవహారాలు చేయడం తరచూ గ్రామాల్లో గొడవలు సృష్టించి తనపై బురద చల్లే కార్యక్రమాలు చేయడం, అధిష్ఠానం చూసి చూడనట్లు వదిలేయడంపై తీవ్ర అసంతృప్తికి లోనయినట్టు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం లోనూ సంచలన విజయం సాధించిన వంశీకి వైకాపా లో ఆదరణ పెరుగుతున్న నేపధ్యంలో సహించలేక దుట్టా, యార్లగడ్డలు పొమ్మనలేక పొగపెట్టిన రీతిలో వంశీ వలనే గొడవలు జరుగుతున్నట్లుగా చిత్రీకరిస్తున్నారని అయన సన్నిహితుల వద్ద బాధ పడుతున్నట్టు తెలుస్తోంది.

 

ఏకంగా ఎమ్మెల్యే పై కేసులు పెట్టాలని పోలీసు అధికారులపై ఒత్తిడి చేయడం పట్ల వంశీ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు మంచి చేయాలని, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలని వైకాపా ప్రభుత్వానికి మద్దతు తెలిపి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం లో పనిచేస్తుంటే లేనిపోని నిందలు మోపడం పై వంశీ అభిమానుల కినుక వహించారారని అంటున్నారు. అందుకే రాజకీయాల నుంచి తప్పుకునే యోచనలో వంశీ ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే సోమవారం బాపులపాడు మండలం లో వివిధ గ్రామాల్లో జరగాల్సిన పర్యటన అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు. భవిష్యత్ కార్యాచరణ పై ముఖ్య నేతలతో చర్చలు జరుపుతున్నారు. సొంత డబ్బుతో 15 సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేస్తూ ఎందుకు కొరగాని నాయకులతో మాటలు పడుతూ రాజకీయాల్లో కొనసాగడం అనవసరమా అంటూ వంశీ ముఖ్య అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related posts