telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్ 2021 : ఒక్క పరుగు విజయంతో ఒక్కటో స్థానానికి వెళ్లిన బెంగళూరు…

ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. దాంతో ఈ ఐపీఎల్ సీజన్ లో పోయిందా పట్టికలో ఒక్కటో స్థానానికి వెళ్ళింది. అయితే ఈ మ్యాచ్ లో 172 పరుగుల లక్ష్యంతో వచ్చిన ఢిల్లీ జట్టులో ఓపెనర్ పృథ్వీ షా (21) పర్వాలేదనిపించారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన ఢిల్లీ కెప్టెన్ పంత్ (58) అలాగే మార్కస్ స్టోయినిస్(22) ఔట్ అయిన తర్వాత వచ్చిన హెట్మెయర్(53) చివరి వరకు పోరాడారు. అయితే ఢిల్లీకి చివరి ఆరు బంతుల్లో 14 పరుగులు కావాల్సి ఉండగా మహ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్ కోల్పోయి 170 పరుగులు మాత్రమే చేసింది. దాంతో బెంగళూరు ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.

ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు ఓపెనర్లు నిరాశపరిచిన తర్వాత రజత్ పాటిదార్(31), గ్లెన్ మాక్స్వెల్(25) స్కోర్ బోర్డును ముందుకు నడిపాడు. కానీ ఎబి డివిలియర్స్(75) అర్ధశతకంతో రెచ్చిపోవడంతో కోహ్లీసేన నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.

Related posts