గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ ఆ పదవి నుండి తప్పుకున్న విషయం తెలిసిందే . అయితే ఇప్పుడు ఆ పదవిలో ఎవర్ని నియమిస్తారు అనే అంశం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఈ పదవి కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో పాటుగా యువ నేతలు సైతం పోటీ పడుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్ నాలుగు రోజులపాటు తెలంగాణలోనే ఉండి నేతల నుంచి అభిప్రాయాలను సేకరించారు. అభిప్రాయాల నివేదికను మాణిక్యం ఠాకూర్ సోనియా గాంధీకి అందజేశారు. కాగా, ఇప్పుడు టి పీసీసీ చీఫ్ కోసం ప్రయత్నాలు చేస్తున్న నేతలంతా ఢిల్లీ బాట పట్టారు. ఇందులో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి సోనియా గాంధీని కలిశారు. టీపీసీసీ చీఫ్ పదవి తనకు ఇవ్వాలని, తనకు అన్ని అర్హతలు ఉన్నాయని సోనియా గాంధీని కోరారు. కోమటిరెడ్డితో పాటు అనేక మంది నేతలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఎవరికి ఆ పదవిని అప్పగిస్తారు అన్నది మరికొని రోజుల్లోనే తేలిపోతుంది. చూడాలి మరి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎవరు ఎంపిక అవుతారు అనేది.
previous post