ప్రపంచ వేదికలపై వెజేతలుగా నిలిచిన భారత క్రీడాకారులకు ఖరీదైన కార్లను కానుకగా ఇవ్వడం హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ కు ఓ ఆనవాయితీగా మారింది. తాజాగా ఆయన భారత బ్యాడ్మింటన్ రారాణి పీవీ సింధుకు లేటెస్ట్ మోడల్ బీఎండబ్ల్యూ కారును బహూకరించారు.
ఇటీవలే సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో విజేతగా నిలిచింది. దాంతో చాముండి ఆమెకు కారును గిఫ్ట్ గా ఇచ్చాడు. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో హీరో నాగార్జున చేతుల మీదుగా సింధుకు కారు బహూకరించారు. అయితే, చాముండి ఇప్పటివరకు 22 కార్లు బహుమతిగా ఇచ్చారు. అందులో ఒక్క సింధూనే వాటిలో 4 కార్లు అందుకోవడం విశేషం. అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించిన ప్రతిసారి సింధుకు చాముండి కారును బహుమతిగా ఇచ్చారు.
వైసీపీ నేతలు చెబితేనే కార్యాలయాల్లో పనులు: చంద్రబాబు