ఆర్థిక రంగానికి ఊతమిచ్చే చర్యలు చేపడుతామని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఢిల్లీలో ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమనంపైఆందోళన వ్యక్తం చేశారు. త్వరలో పన్ను వ్యవస్థలో సంస్కరణలు తెస్తామని స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్నా.. అదుపులోనే ఉందని తెలిపారు. త్వరలో పారిశ్రామిక ఉత్పత్తి పెరుగుతుందని భావిస్తున్నామని వెల్లడించారు.
ఇల్లు కొనేవారికి మరిన్ని రాయితీలు అందజేస్తామని మంత్రి అన్నారు. అదనంగా కట్టిన జీఎస్టీ, ఆదాయపు పన్నును ఆన్లైన్లో వెనక్కి ఇచ్తేస్తాం. ఎగుమతులకిచ్చే బ్యాంకు రుణాలకు ఇన్సూరెన్స్తో గ్యారంటీ కల్పిస్తామని తెలిపారు. వివిధ రుణాలకిచ్చే వడ్డీ రేటు దాదాపు 4 శాతం తగ్గించామని ఆమె పేర్కొన్నారు. ఈ నెల 19న బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం ఉంటుంది. చిన్న మొత్తాల్లో పన్ను చెల్లింపుదారులకు కఠిన చర్యలు ఉండబోవన్నారు. ఐటీ రిటర్న్స్లో జరిగే చిన్నచిన్న పొరపాట్లకు గతంలో మాదిరి పెద్ద చర్యలు ఉండవన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్లో భారత్ స్థానం మెరుగైందన్నారు.