తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ సోమవారం హైదరాబాద్ ప్రగతి భవన్లో భేటీ అయ్యారు. ఈ సాయంత్రం తెలంగాణ కేసీఆర్ నివాసమైన ప్రగతి భవన్కు జగన్ చేరుకున్నారు. ఆయనకు కేసీఆర్ స్వయంగా స్వాగతం పలికి లోపలికి తెసుకెళ్లారు. అనంతరం వీరిద్దరి భేటీ ప్రారంభమైంది. దాదాపు రెండు గంటల పాటు సమావేశం జరగనుంది.
విభజన చట్టంలోని పలు అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చలు జరుపుతారు. జల వనరుల సద్వినియోగం.. 9, 10 షెడ్యూళ్లలోని ఆస్తుల పంపకాలు, ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన పెండింగు విద్యుత్తు బిల్లులపై చర్చించే అవకాశముందని తెలుస్తోంది. రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు భేటీలో పాల్గొన్నారు.