ఈ ఏడాది మొదట్లో సీనియర్ హీరో వెంకటేష్తో కలిసి చేసిన “ఎఫ్2″తో మంచి విజయాన్ని అందుకున్నాడు వరుణ్ తేజ్. తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో చేసిన “గద్దలకొండ గణేష్”సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ గద్దలకొండ గణేష్ పాత్రలో వరుణ్ తేజ్ నటన అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంటోంది. కెరీర్ మొదటి నుంచీ డిఫరెంట్ పాత్రలు చేసుకుంటూ వెళుతున్న వరుణ్ తేజ్.. “గద్దలకొండ గణేష్” సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్నాడు. ఈ సందర్భంగా మంచు లక్ష్మీ Voot అనే డిజిటల్ ఫ్లాట్ఫామ్లో వరుణ్ తేజ్ను ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్.. పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మీ, వరుణ్ తేజ్ ను ఇప్పటి వరకు నటించిన హీరోయిన్స్ గురించి అడగగా… వరుణ్ మాట్లాడుతూ అవకాశమొస్తే సాయి పల్లవిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఛాన్స్ వస్తే పూజా హెగ్డేతో డేటింగ్ చేస్తానని చెప్పుకొచ్చాడు. అంతేకాదు రాశిఖన్నాను చంపేయాలనుంది అంటూ చాలా జోవియల్గా సమాధానం చెప్పాడు. ఏమైనా “ఫిదా” సినిమాలో తనతో నటించిన సాయి పల్లవికి వరుణ్ తేజ్ నిజంగానే ఫిదా అయినట్టు ఈ ఇంటర్వ్యూ బట్టి చెప్పొచ్చు.