ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆనందయ్య కరోనా మందు గురించి చర్చిస్తున్నారు. అయితే ఈ మందు పంపిణీ చేయడం ప్రస్తుతం ఆగిపోయింది. అయితే, చాలా మంది ఆనందయ్యకు సపోర్ట్ చేస్తున్నారు.. ప్రభుత్వం వెంటనే ఆనందయ్యతో మందు పంపిణీ చేయించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.. మరోవైపు.. ఆనందయ్య ఆయుర్వేద మందు కొనసాగించాలని కోరుతూ.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు అయ్యింది… అనంతపురానికి చెందిన ఉమా మహేశ్వర నాయుడు అనే వ్యక్తి తరపున పిటిషన్ దాఖలు చేశారు న్యాయవాది బాలాజీ.. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో.. కరోనా నివారణ కోసం ఆనందయ్య ఆయుర్వేద మందు ఇస్తున్నారని పేర్కొన్న పిటిషనర్.. ప్రభుత్వం ఈ మందు పంపిణీ నిలిపి వేసిందని, దీనిపై విచారణ జరపాలని కోరారు. అయితే చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
previous post
అందుకే కాంగ్రెస్ ను వీడుతున్నాను: ఎమ్మెల్యే లింగయ్య