ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 24వ తేదీ ఉదయం 10.30 గంటలకు గవర్నర్ గా ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. తన కుటుంబసభ్యులతో కలసి భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి 23వ తేదీ ఉదయం 10 గంటలకు ఆయన రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరుమల చేరుకుని శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకుంటారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని గన్నవరం బయల్దేరుతారు. మరుసటి రోజు బుధవారం గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేస్తారు.