కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేమని తేల్చి చెప్పింది.
కాళేశ్వరానికి పెట్టుబడుల అనుమతులు కూడా లేవని, అందుకే కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేదని కేంద్ర నీటి జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు పేర్కొన్నారు.
లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ టుడు ఈమేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ 2016, 2018లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీలేఖలు రాసినట్లు పేర్కొంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని స్పష్టం చేశారు.
జాతీయ హోదా కావాలంటే.. సీడబ్ల్యూసీ అధ్యయనం తప్పనిసరని, ప్రాజెక్టు అడ్వైజరీ కమిటీ కూడా ఆమోదం ఉండాలని, ప్రాజెక్టు పెట్టుబడులపై కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాలన్నారు.
అనుమతులుంటే కాళేశ్వరాన్ని హైపవర్ స్టీరింగ్ కమిటీ పరిశీలించాలని, హైపవర్ స్టీరింగ్ కమిటీ అనుమతి ఇస్తే కాళేశ్వరానికి జాతీయ హోదా అవకాశం ఉంటుందని లేఖలో కేంద్రమంత్రి పేర్కొన్నారు.కాళేశ్వరానికి పెట్టుబడుల అనుమతులు కూడా లేవని కేంద్ర జలశక్తిశాఖ స్పష్టం చేసింది
హుజూర్నగర్ ఫలితాలు విపక్షాలకు చెంపపెట్టు: తలసాని