ఉత్తరప్రదేశ్ విద్యాశాఖ మంత్రి కమలా రాణి కరోనా వైరస్ భారీనపడి మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం కరోనా సోకడంతో ఆమె చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారు. లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం ఆమె మృతి చెందారని వైద్యులు ప్రకటించారు.
యూపీ ప్రభుత్వం కరోనా కట్టడిలో భాగంగా చేపట్టిన కార్యక్రమాల్లో ఆమె చురుకుగా పాల్గొనే వారు. ఆ సమయంలోనే ఆమెకు కరోనా సోకింది. గతంలో ఆమె లోక్సభ సభ్యురాలిగానూ పనిచేశారు. ఆమెకు ఓ కుమార్తె ఉంది. కమలా రాణి మృతి పట్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.