telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కరోనాతో యూపీ మంత్రి కమలరాణి మృతి

up minister kamalarani

ఉత్తరప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి కమలా రాణి కరోనా వైరస్‌ భారీనపడి మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం కరోనా సోకడంతో ఆమె చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారు. లక్నోలోని సంజ‌య్ గాంధీ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం ఆమె మృతి చెందారని వైద్యులు ప్రకటించారు.

యూపీ ప్రభుత్వం కరోనా కట్టడిలో భాగంగా చేపట్టిన కార్యక్రమాల్లో ఆమె చురుకుగా పాల్గొనే వారు. ఆ సమయంలోనే ఆమెకు కరోనా సోకింది. గతంలో ఆమె లోక్‌సభ సభ్యురాలిగానూ పనిచేశారు. ఆమెకు ఓ కుమార్తె ఉంది. కమలా రాణి మృతి పట్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

Related posts