telugu navyamedia
రాజకీయ వార్తలు

రాహుల్ ప్రొత్సహంతోనే కార్యకర్తలు రెచ్చిపోతున్నారు: స్మృతీ ఇరానీ

Minister Smruti Irani Ladies development

అమేథి నుంచి ఎప్పటి లాగే కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ బరిలో నిలిచారు. ఆయనపై పోటీగా కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ రంగంలోకి దిగారు. దీంతో ఇరు పార్టీలు ఇక్కడ విజయం కోసం పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. ఐదవ విడత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అమేథిలో కాంగ్రెస్ కార్యకర్తలు పోలింగ్ బూత్‌లను ఆక్రమించి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు.

రాహుల్ ప్రొత్సహంతోనే కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. అమేథిలో బూత్‌ల ఆక్రమణపై తాను ఉత్తరప్రదేశ్ ఎన్నికల అధికారులకు సమాచారం అందించానని స్మృతీ తెలిపారు. ఈ వ్య్వహారమ్ పై అధికార యంత్రాంగం తగిన చర్యలు చేపడుతుందని ఆశిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. రాహుల్ దుర్మార్గాలను గమనించి అమేథి ఓటర్లు తగినరీతిలో గుణపాఠం చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Related posts