అనంతపురం జిల్లాలో ఓ వాహనం మంటల్లో చిక్కుకొని కాలి బూడిదైంది. నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. అదృష్టవశాత్తు అందులో ప్రయాణిస్తున్నవారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. వివరాల్లోకి వెళితే.. తపోవనం నుంచి బెంగుళూరుకు వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ఫ్లైఓవర్ పైనే వాహనాన్ని నిలిపివేశాడు. అందులో ఉన్న వారు బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదలో డ్రైవర్కు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
previous post