telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పరిషత్ ఎన్నికల్లో ఓటేసిన కవిత

MP Kavitha comments BBP Govt.

టీఆర్ఎస్ నేత, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పరిషత్ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నవీపేట్ మండలం పోతంగల్ లో ఆమె ఓటేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు.

టీఆర్ఎస్ ఎంపీటీసీలు, జడ్పీటీసీల గెలుపుకు ప్రతి ఒక్కరూ సహకరించి, గ్రామాల అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరే ఈ ఎన్నికల్లో కూడా వార్ వన్ సైడే ఉంటుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. దేశ అభివృద్ది కోసం అన్ని పార్టీలను ఏకం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారని ఆమె తెలిపారు.

Related posts