లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపిన టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఇవాళ కేరళ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేరళకు పయనమయ్యారు. కేరళ పర్యటనలో భాగంగా కేసీఆర్ సోమవారం సాయంత్రం 6 గంటలకు త్రివేండ్రంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్తో సమావేశం కానున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కేరళ పర్యటనలో భాగంగా రామేశ్వరం, శ్రీరంగం దేవాలయాలను కేసీఆర్ సందర్శించనున్నారు.
ఈనెల 13న సాయంత్రం 4.30గంటలకు చెన్నైలో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్తో సీఎం కేసీఆర్ భేటీకానున్నారు. దేశరాజకీయాలపై స్టాలిన్తో చర్చించనున్నారు. కేరళ, తమిళనాడు పర్యటనల నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి.. సీఎం కేసీఆర్తో ఫోన్లో మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో దేశ రాజకీయ పరిణామాల గురించి చర్చించే అవకాశముంది.
ఇసుక విధానంపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలి: పురంధేశ్వరి