గతేడాది ఎవరూ ఊహించని రీతిలో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు. కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మాత్రమే మహీ ఆడుతున్నాడు. కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ మధ్యలోనే వాయిదా పడడంతో ధోనీ ఇంటికివెళ్లిపోయాడు. గతేడాది కరోనా వైరస్ మహమ్మారి కారణంగా యూఏఈలో అభిమానుల్లేకుండానే ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. ఐపీఎల్ 2020లో భాగంగా షార్జా స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇన్నింగ్స్ చివరలో ఎంఎస్ ధోనీ వరుస సిక్సర్లు కొట్టాడు. అందులో ఓ సిక్స్ స్టేడియం బయట రోడ్డుపై పడింది. ఆ బంతిని ఓ అభిమాని తీసుకుని వెళ్లిపోయాడు. ఇది అక్కడి కెమెరాల్లో రికార్డు అయింది. ఆ బంతి పడిన చోటును గూగుల్ మ్యాప్లో ‘ధోనీస్ సిక్స్’గా అభిమానులు పేరు పెట్టారు. దానికి తాజాగా గూగుల్ నుంచి ధ్రువీకరణ వచ్చింది. దీనికి సంబందించిన ఫొటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో ధోనీ ఫాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.
previous post
next post