ట్విట్టర్ కు షాక్ ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు. నటి మీరా చోప్రా కేసులో ట్విట్టర్ కు హైదరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. గత ఏడాది జూన్ లో నటి మీరా చోప్రాపై అసభ్యకరమైన మెసేజ్ లపై కేసు నమోదు చేశారు పోలీసులు. అప్పట్లో సైబర్ క్రైమ్ లో కేసుతో పాటు ట్విట్టర్ కు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆ మెసేజ్లను డిలీట్ చేసింది ట్విటర్. అయితే ఆ మెసేజ్ లు పెట్టిన వ్యక్తి వివరాలు ఇవ్వకపోవడంతో తాజాగా మరోసారి ట్విట్టర్ కు నోటీసులు జారీ చేసారు హైదరాబాద్ పోలీసులు. అయితే సైబర్ క్రైమ్ పోలీసులు ఇచ్చిన నోటీసులపై ట్విట్టర్ ఇంకా స్పందించలేదు. పోలీసులు ఇచ్చిన నోటీసులపై ట్విట్టర్ ఎలా స్పందిస్తుందో అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
previous post
next post
ఆ స్టార్ హీరో సెట్లోనే నాతో చాలా దారుణంగా వ్యవహరించారు : హీరోయిన్