దర్శకుడు మారుతి ప్రతి రోజు పండగే సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. మెగా మేనల్లుడు సాయి ధరమ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. వెంటనే మరో సినిమాను పట్టాలెక్కించాలని మారుతి అనుకున్నాడు. కానీ కరోనా రావడంతో అతడి సినిమా వెనక్కి వెళ్లింది. అయితే లాక్డౌన్ ఎత్తేసిన తరువాత మారుతి తన సినిమా తెరకెక్కించాలని అనుకున్నాడు. అందుకోసం ఈ సినిమాలో హీరోగా ముందుగా రవితేజను సంప్రదించారు. రవితేజకు కూడా ఈ సినిమా కథ నచ్చడంతో ఓకే చెప్పాడట. కానీ పారితోషికం సెట్ అవ్వక దీని నుంచి మాస్ మహరాజ్ తప్పుకున్నాడు. దాని తరువాత ఈ సినిమాను తీసుకొని గోపీచంద్ను కలిసాడు మారుతి. కథ నచ్చడంతో గోపీ చంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమాకు పక్కా కమర్షియల్ అనే పేరును ఖరారు చేశారు. ఈ సినిమాలో గోపీచంద్ లాయర్ పాత్రలో కనపించనున్నాడు. ఈ సినిమా జీఏ2 పిక్చర్స్ ,యూవీ క్రియేషన్స్ నిర్మించనున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం గోపీచంద్ తన నూతన సినిమా సీటీమార్ విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమా విడుదలైన తరువాత మారుతి కాంబో పక్కా కమర్షియల్ చిత్రీకరణలో పాల్గొననున్నాడు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
previous post