telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

భూవివాదం కారాణంగానే తహసీల్దార్‌ హత్య!

vijaya tahasildar

అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ విజయారెడ్డి హత్యకేసులో గౌరెల్లికి చెందిన కూర సురేష్‌ అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించామని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ పేర్కొన్నారు. కేసుకు సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు వివరాలను సీపీ వెల్లడించారు. బాచారాంలోని తన 7 ఎకరాల భూవివాదం వ్యవహారంలో హత్య జరిగినట్లు అనుమానిస్తున్నామని పేర్కొన్నారు. మధ్యాహ్నం 1.15 గంటలకు ఈ ఘటన జరిగిందన్నారు. ఈ ఘటనలో గాయపడిన సురేష్‌కు చికిత్స అందిస్తున్నామని సీపీ చెప్పారు.

భోజన విరామంలో దుండగుడు దారుణానికి యత్నించినట్లు తెలుస్తోంది. దాడి జరిగినప్పుడు ఆమె బయటకి రావడానికి కొంత ఇబ్బంది కలిగింది. డోర్‌ను డ్రైవర్‌, అటెండర్‌ ఓపెన్‌ చేసిన తర్వాత మంటలతోనే బయటకి వచ్చి వరాండాలో పడిపోయి సజీవ దహనమైంది. నిందితుడు దాడి చేయడానికి గల కారణాలు, ఎవరైనా అతని వెనకుండి ఈ దాడి చేయమని ప్రోత్సహించారనే విషయాలు దర్యాప్తులో తేలుతుందన్నారు.

Related posts