telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్ 2021 : ఢిల్లీ టార్గెట్ ఎంతంటే…?

ఐపీఎల్ 2021 లో నేడు చెన్నై వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ను ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు బాగానే కట్టడి చేసారు. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదటబ్యాటింగ్ చేసిన ముంబై ఓపెనర్ డికాక్ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరుకున్న తర్వాత సూర్యకుమార్ యాదవ్(24), రోహిత్ శర్మ (44) ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. కానీ ఆ తర్వాత ఢిల్లీ స్పిన్నర్ అమిత్ మిశ్రా వరుస ఓవర్లలో వికెట్లు తీసి ఆ జట్టును కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్(26), జయంత్ యాదవ్(23) చివర్లో కొన్ని పరుగులు చేయడంతో ఆ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. ఇక ఢిల్లీ బౌలర్లలో అమిత్ మిశ్రా 4 వికెట్లు పడగొట్టగా అవెష్ ఖాన్ రెండు, మార్కస్ స్టోయినిస్, లలిత్ కగిసో రబాడా ఒక్కో వికెట్ తీశారు. అయితే ఈ మ్యాచ్ లో ఢిల్లీ విజయం సాధించాలంటే 138 పరుగులు చేయాలి. ఇక గత రెండు మ్యాచ్ లలో ముంబై 150 పరుగులనే కాపాడుకొని విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్ లో ఏం చేస్తుంది అనేది చూడాలి.

Related posts