telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణలో కరోనా విలయం… ఇవాళ 24 గంటల్లో

తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2 లక్షల మార్క్ ను దాటాయి. అయితే…ఇవాళ రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య కాస్త తగ్గింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 1,021 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 2,214 మంది కోలుకున్నారు.. ఆరుగురు మృతిచెందారు. దీంతో.. పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,13,084కి చేరుకోగా… ఇప్పటి వరకు కరోనాబారినపడి 1,87,342 మంది కోలుకున్నారు. 1,228 మంది మృతిచెందారు.

దేశవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 1.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.57 శాతానికి పడిపోయిందని.. రికవరీ రేటు దేశంలో 85.9 శాతంగా ఉంటే.. స్టేట్‌లో 87.91 శాతానికి పెరిగిందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇక, ప్రస్తుతం 25,514 యాక్టివ్ కేసులు ఉన్నాయి… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 30,210 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మరోవైపు.. జీహెచ్‌ఎంసీ పరిధిలో తాజా కేసులు 228 నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 68, మేడ్చల్‌లో 84, కరీంనగర్‌లో 67, నల్గొండలో 46 అత్యధికంగా నమోదు అయ్యాయి. అయితే…జీహెచ్‌ఎంసీ పరిధిలో క్రమంగా కేసులు తగ్గడం శుభపరిణామం.

Related posts