అధికారంలో ఉన్న నాయకులు అధికారుల పై దాడులు చేయడం ఈ మధ్య హాట్ టాపిక్ గా మారింది. పలు రాష్ట్రాల్లో ఎమ్మేల్యేలు, ఎంపీలు విదుల్లో ఉన్న సిబ్బంది పై దాడులకు దిగుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే యూపీలో జరిగింది. షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ ఛైర్మన్, బీజేపీ ఎంపీ రామ్ శంకర్ కాథెరియా భద్రతా సిబ్బంది టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో చోటుచేసుకుంది. భద్రతా సిబ్బందిలోని ఓ వ్యక్తి తుపాకి తీసి గాల్లోకి కాల్పులు జరిపాడు. ఆ సమయంలో కాథెరియా సంఘటనా స్థలంలోనే ఉన్నారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
previous post
next post