telugu navyamedia
తెలంగాణ వార్తలు

నేడు ఢిల్లీకి తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్..

తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం వెంట టీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు, మంత్రులు కూడా వెళ్లనున్నారు.

జాతీయ రాజకీయాల సన్నాహాల కోసమే కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. రెండు, మూడు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలోనే బస చేయనున్నారు.

జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని భావిస్తున్న కేసీఆర్ కొందరు జాతీయ నేతల్ని కలిసి కేసీఆర్ చర్చలు అవకాశముందని తెలిసింది. 

కాగా.. ఇప్పటికే పలుమార్లు ఢిల్లీలో పర్యటించిన సీఎం కేసీఆర్.. జాతీయ రాజకీయాలపై దృష్టిసారించారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సైతం సమావేశమై.. బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు పలు వ్యూహాలు రచించారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ మళ్లీ ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటంతో పాలిటిక్స్ మరింత వేడెక్కాయి.

Related posts