telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

అంబేడ్కర్‌ విగ్రహం ధ్వంసం కేసులో ఇద్దరు అరెస్ట్‌

young man arrested for selfie in polls

హైదరాబాద్ పంజాగుట్ట చౌరస్తాలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అంబేడ్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇద్దరని పోలీసులు అరెస్ట్‌ చేశారు. జీహెచ్‌ఎంసీ చెత్త డంపింగ్‌ లారీ డ్రైవర్‌ రాజు, గుప్తా అరెస్ట్‌ చేశారు. వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి నిందితులను రిమాండ్‌కు తరలించాలని పోలీసులను ఆదేశించారు. ఈ కేసులో మరో ఇద్దరు జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు పరారీలో ఉన్నారు.

పంజాగుట్ట చౌరస్తాలో సెంట్రల్‌ షాపింగ్‌ మాల్‌కు ఎదురుగా మాజీ సీఎం వైఎస్‌ఆర్‌ విగ్రహానికి సమీపంలో జై భీమ్‌ సొసైటీ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహ పరిరక్షణ కమిటీ 9 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశాయి. సాయంత్రానికే ఆ విగ్రహం ధ్వంసమైన స్థితిలో జవహర్‌ నగర్‌ డంపింగ్‌ యార్డులో ప్రత్యక్షమైంది. దీనిపై ఎస్సీ, ఎస్టీ సంఘాలు, ప్రజాస్వామిక వాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts