జీహెచ్ఎంసీ ఎన్నికలు హైదరాబాద్లో కాకరేపుతున్నాయి… రేపటితో గ్రేటర్లో నామినేషన్లు ముగియనున్నాయి.. ఓవైపు అభ్యర్థులు ఎంపికపై కసరత్తు చేస్తూనే.. మరోవైపు ప్రచారంపై ఫోకస్ పెట్టాయి ఆయా పార్టీలు.. ఇప్పటికే డివిజన్ల వారిగా ఇంఛార్జ్లు కూడా ప్రకటించి.. పార్టీ శ్రేణులను కదిలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి గ్రేటర్ పరిధిలో సీఎం కేసీఆర్ ఓ ప్రచార సభలో పాల్గొనే అవకాశం ఉందని చెబుతున్నారు టీఆర్ఎస్ నేతలు.. ఇక, గతంలో మాదిరిగానే.. మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. విస్తృతంగా ప్రచారంలో పాల్గొననున్నారు.. ఈ నెల 22వ తేదీ నుండి గ్రేటర్లో రోడ్షోలు నిర్వహించనున్నారు కేటీఆర్… కుత్బుల్లాపూర్ నుండి కేటీఆర్ రోడ్డు షోలు ప్రారంభం అవుతాయని చెబుతున్నారు టీఆర్ఎస్ నేతలు.. ఇక, ఈ నెల 28న ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగసభ నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారని.. ఈ సభకు గులాబీ అధినేత, సీఎం కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే చూడాలి మరి కేసీఆర్ ప్రచారం తెరాస కు ఎంతమేర సహాయపడుతుంది అనేది.
రద్దుల ప్రభుత్వంలా వైసీపీ సర్కారు: చంద్రబాబు